
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్యలో నాల్గొవ రోజు న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మెక్కల్లమ్ 124, విలియమ్సన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో టెస్టు మ్యాచ్ కూడా డ్రా దిశగా పయనిస్తుంది.

రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా 10 వేల అంగన్వాడీ కేంద్రాలను ఆదివారం బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ఉద్దేశించిన ఐసిడిఎస్ కేంద్రాలకు అనుబంధంగా ఇప్పటికే పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు అదనంగా ఏర్పాటు చేసిన ఈ 10 వేల కేంద్రాలను మంత్రి మాణిక్యవరప్రసాద్ ప్రారంభించారు.
''హలో... హలో... ఇప్పుడే రేంజర్ కారు బయటకు పోతోంది. అది నంద్యాల వైపు వెళ్తోంది. డిఎఫ్ఓ కారు లోపలే ఆగి ఉంది. సిబ్బంది కూడా ఒక్కొక్కరుగా ఆఫీసుకు చేరుకుంటున్నారు. మన లారీ ఎక్కడుంది? అడవులు దాటారా?, కలప ఎక్కించారా? పైన చెత్తవేసి కప్పేయండి... వెంటనే బయలు దేరండి...''ప్రకాశం జిల్లా గిద్దలూరు డివిజన్ ఫారెస్టు కార్యాలయం ఎదురుగా ఓ వ్యక్తి ఆదరాబాదరాగా.. హైరానా పడుతూ... సెల్ఫోన్లో స్మగ్లర్లకు సమాచారం చేరవేస్తున్న వైనం ప్రజాశక్తి కంటబడింది. స్మగ్లర్లకు చెందిన ఆ వ్యక్తి అధికారుల కదిలికలను తమ వారికి తెలియజేస్తూ కలప లారీని బయటకు తెచ్చే పనిలో నిమగమై ఉన్నాడు. ప్రజాశక్తి పరిశీలనలో అనేక విషయాలు వెలుగుచూశాయి.
మైదానంలో ఎప్పుడూ తెగ హడావిడి చేసే హర్భజన్ సింగ్ బ్యాటింగ్లోనూ చెలరేగుతున్నాడు. అతడు క్రమంగా లోయర్ ఆర్డర్ సెహ్వాగ్గా మారు తున్నాడా అన్న అనుభూతి ఆదివారం నాడు అతడు ఆడిన ఇన్నింగ్స్ను చూస్తుంటే కలుగు తుంది. ఆదివారం సెలవును ఆస్వాదించేందుకు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు నూటికి నూరు శాతం సంతృప్తి కలిగించాడు. 85 పరుగులతో నాటౌట్గా నిలిచిన భజ్జీ అహ్మదాబాద్ ఫీట్ను రిపీట్ చేస్తాడా, భారత్ తొలి ఇన్నింగ్స్లో ఎన్ని పరుగుల