సోమవారం 15 నవంబర్ 2010

న్యూజిలాండ్‌ స్కోరు 237/4


భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్యలో నాల్గొవ రోజు న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మెక్‌కల్లమ్‌ 124, విలియమ్‌సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో టెస్టు మ్యాచ్‌ కూడా డ్రా దిశగా పయనిస్తుంది.

తప్పెవరిదా?




''తల్లీ! డాడి, మనందరికోసం, అంతదూరం వెళ్ళి కష్టపడుతున్నారు. 
అది అర్థం చేసుకుని మీరు చదవాలి.''

క్లియర్‌ వెజిటబుల్‌ సూప్‌


క్యారెట్లు - 3 , క్యాబేజి ముక్కలు - ఒక కప్పు , క్రీమ్‌ - ఒక టేబుల్‌ స్పూన్‌, వెన్న - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - కొద్దిగా
గిలకొట్టిన క్రీమ్‌ - మూడు టేబుల్‌ స్పూన్లు, బఠాణీలు - పావు కప్పు, కొద్దిగా పుదీనా

ఆయన కూడా లేరు



ఎట్టకేలకు పిల్లలను పంపించేయడంతో కాస్త వూపిరి పీల్చుకోవచ్చని వసారాలోకి వచ్చింది సుభద్ర. పక్క వాటాలోంచి పద్మజ కూడా అప్పుడే తలుపు తీస్తున్నట్టనిపించి ఆగింది. నిజంగానే ఆమె తలుపు తెరచుకుని బయిటకు వచ్చి పలకరింపుగా నవ్వింది.


















ఏమిటి లోపలే వున్నావా.. ఇంకా తలుపు వేసుంటేనూ నీవు లేవేమోననుకున్నా అంది సుభద్ర కలుపుగోలుగా.

పిల్లల రాజ్యం


పిల్లలను అపురూపంగా చూసుకుంటాం. ప్రతి విషయంలోనూ వారికి ప్రప్రథమ ప్రాధాన్యతనిస్తుంటాం. వారిగురించి ప్రత్యేకంగా ఆలోచిస్తాం. వారికోసం పరితపిస్తాం. వారికోసం ఏం చేయాలి? ఏం చేస్తే వారి భవిష్యత్తు బంగారుమయమౌతుంది?

10 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం


రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా 10 వేల అంగన్‌వాడీ కేంద్రాలను ఆదివారం బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ఉద్దేశించిన ఐసిడిఎస్‌ కేంద్రాలకు అనుబంధంగా ఇప్పటికే పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు అదనంగా ఏర్పాటు చేసిన ఈ 10 వేల కేంద్రాలను మంత్రి మాణిక్యవరప్రసాద్‌ ప్రారంభించారు.

కేంద్ర స్థాయిలో దర్యాప్తు


ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ స్కాంపై కేంద్ర స్థాయిలో దర్యాప్తు జరిపించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. కార్గిల్‌ అమరవీరుల కుటుంబాలకు కేటాయించిన ఈ సొసైటీలోని ఫ్లాట్లను రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అక్రమంగా పొందడం దేశానికే అవమానవని ఆయన వ్యాఖ్యానించారు.

ఎల్లలు దాటుతున్న ఎర్రచందనం

  ''హలో... హలో... ఇప్పుడే రేంజర్‌ కారు బయటకు పోతోంది. అది నంద్యాల వైపు వెళ్తోంది. డిఎఫ్‌ఓ కారు లోపలే ఆగి ఉంది. సిబ్బంది కూడా ఒక్కొక్కరుగా ఆఫీసుకు చేరుకుంటున్నారు. మన లారీ ఎక్కడుంది? అడవులు దాటారా?, కలప ఎక్కించారా? పైన చెత్తవేసి కప్పేయండి... వెంటనే బయలు దేరండి...''ప్రకాశం జిల్లా గిద్దలూరు డివిజన్‌ ఫారెస్టు కార్యాలయం ఎదురుగా ఓ వ్యక్తి ఆదరాబాదరాగా.. హైరానా పడుతూ... సెల్‌ఫోన్‌లో స్మగ్లర్లకు సమాచారం చేరవేస్తున్న వైనం ప్రజాశక్తి కంటబడింది. స్మగ్లర్లకు చెందిన ఆ వ్యక్తి అధికారుల కదిలికలను తమ వారికి తెలియజేస్తూ కలప లారీని బయటకు తెచ్చే పనిలో నిమగమై ఉన్నాడు. ప్రజాశక్తి పరిశీలనలో అనేక విషయాలు వెలుగుచూశాయి.

రాజా రాజీనామా


అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర టెలికాం మంత్రి ఎ రాజా ఎట్టకేలకు రాజీనామా చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధితో రెండుసార్లు చర్చలు జరిపిన రాజా చెన్నరు నుండి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 1.76 లక్షల కోట్ల రూపాయల 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో చిక్కుకొని అప్రదిష్ట పాలైన ఆయన ప్రతిపక్షాల రాజీనామా డిమాండ్‌కు తలొగ్గక తప్పలేదు. సోమవారం నుండి తిరిగి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ వ్యవహారం చర్చకు రానున్నది. దీనికి సంబంధించిన రెండు

దెబ్బ మీద దెబ్బ రైతు విలవిల


  'ఈ ఏడాది సార్వాలో రెండుసార్లు నారుమళ్లు పోశా. ఎకరాకు 12 వేల వరకూ అప్పు చేసి పెట్టుబడి పెట్టా. మొత్తం మునిగిపోయింది. మూడెకరాల్లో రూ.36 వేల పెట్టుబడిలో చిల్లిగవ్వ చేతికి రాని పరిస్థితి.' ఇదీ పాలకొల్లు రూరల్‌ మండలం లంకలక ోడేరుకు చెందిన కౌలు రైతు బీరెడ్డి సత్యనారాయణ ఆవేదన.'కోతకోసిన ఎకరం వరిపైరు

భజ్జీ జోరు : భారత్‌ 436/9 ........హర్భజన్‌ 85 నాటౌట్‌

మైదానంలో ఎప్పుడూ తెగ హడావిడి చేసే హర్భజన్‌ సింగ్‌ బ్యాటింగ్‌లోనూ చెలరేగుతున్నాడు. అతడు క్రమంగా లోయర్‌ ఆర్డర్‌ సెహ్వాగ్‌గా మారు తున్నాడా అన్న అనుభూతి ఆదివారం నాడు అతడు ఆడిన ఇన్నింగ్స్‌ను చూస్తుంటే కలుగు తుంది. ఆదివారం సెలవును ఆస్వాదించేందుకు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు నూటికి నూరు శాతం సంతృప్తి కలిగించాడు. 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన భజ్జీ అహ్మదాబాద్‌ ఫీట్‌ను రిపీట్‌ చేస్తాడా, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగుల

ఛాలెంజింగ్‌ పాత్రలే చేస్తా : ప్రియాంకా చోప్రా

నవరసాలూ పండించగల అతికొద్దిమంది అందాల భామల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. ఎంపిక చేసుకున్న చిత్రంలో నటనకు వీలైనంత స్కోపుంటేనే డేట్స్‌ కన్‌ఫర్మ్‌ చేస్తుంది. కేవలం మేకప్‌ వేసుకున్నంత మాత్రాన గ్లామర్‌ నటులయిపోరని, అభినయాన్ని తనదైన తరహాలో చూపేవారే నిలబడతారని ప్రియాంకా చెప్పుకొస్తోంది. ఇంకా ఏమందంటే...

మనోజ్‌, వరుణ్‌ సందేశ్‌ కాంబినేషన్‌లో భారీ చిత్రం

 


జి.కె.ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థ అధినేత విక్రమ్‌కృష్ణ ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచు మనోజ్‌, వరుణ్‌ సందేశ్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం తీయనున్నారు. ముక్కోణపు ప్రేమకథా చిత్రం. ఈ సందర్భంగా విక్రమ్‌కృష్ణ మాట్లాడుతూ...'

క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి : ద్రవ్య విధానాన్ని ఆర్‌బిఐ తిరిగి సమీక్షించాలి : పరిశ్రమ

సెప్టెంబరు నెలలో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా క్షీణించినందున, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) తన ద్రవ్య విధానాన్ని ఒకసారి సమీక్షించాలని భారతీయ కార్పొరేట్లు కోరుతున్నారు. ఈ సంవత్సరం ఆర్‌బిఐ కీలక పాలసీ రేట్లను ఆరుసార్లు పెంచిందని, పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించడానికి ఆ పెంపుదల కూడ కారణమయివుంటుందని పరిశ్రమ భావిస్తోంది. ఫిక్కి ప్రధాన కార్యదర్శి అమిత్‌ మిత్రా మాట్లాడుతూ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల (ఐఐపి డేటా) దృష్యా ఆర్‌బిఐ తన ఆర్థిక చర్యలను తిరిగి సమీక్షించడం ద్వారా ఉత్పత్తి రంగంలో యీ తగ్గుదలను అరికట్టేందుకు జోక్యం చేసుకోవాలని కోరనున్నట్లు