'పైరగాలి వచ్చి నన్ను పాటపాడమంది.. రైలు కూత చేరి నన్ను రాగం తియ్యమంది...' అనే పాటను 'తెలుగమ్మాయి' కోసం అనంత్ శ్రీరామ్ రాశారు. దీని చిత్రీకరణ జరుగుతోంది. వైష్ణవి మూవీస్ బ్యానర్లో వానపల్లి బాబూరావు నిర్మిస్తున్నారు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ... 'ఈనెల 17 నుంచి 20వరకు ఫిలింసిటీలో రైల్వేస్టేషన్లో ప్రదీప్ ఆంథోనీ నేతృత్వంలో పాట చిత్రీకరించాం. కథప్రకారం గోదావరి ఎక్స్ప్రెస్లో వెళుతూ ఉండగా ఈ పాట సాగుతుంది. తొలి షెడ్యూల్ అనుకున్నట్టుగా పూర్తయింది' అని చెప్పారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి