మూవీ మొఘల్ రామానాయుడ్ని తెలుగు సినీ పరిశ్రమ ఘనంగా సత్కరించనుంది. దాదా ఫాల్కే పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలు చేసినవారికి ప్రభుత్వం ఈ పురస్కారం అందజేస్తుంది. సత్కరించే విషయాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీ మోహన్ తెలిపారు. హోటల్ నోవాటెల్లో డిసెంబర్ 6న కార్యక్రమాన్ని జరపనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవనున్నట్టు సమాచారం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి