.

29, నవంబర్ 2010, సోమవారం

సత్కరించనున్న తెలుగు సినీ పరిశ్రమ

మూవీ మొఘల్‌ రామానాయుడ్ని తెలుగు సినీ పరిశ్రమ ఘనంగా సత్కరించనుంది. దాదా ఫాల్కే పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలు చేసినవారికి ప్రభుత్వం ఈ పురస్కారం అందజేస్తుంది. సత్కరించే విషయాన్ని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మురళీ మోహన్‌ తెలిపారు. హోటల్‌ నోవాటెల్‌లో డిసెంబర్‌ 6న కార్యక్రమాన్ని జరపనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరవనున్నట్టు సమాచారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి