.

26, నవంబర్ 2010, శుక్రవారం

ఆలుపెరుగని పయనం

నవంబరు 9నుండి 12వరకూ కాన్పూరులో జరిగిన తొమ్మిదవ ఐద్వా జాతీయ మహాసభల్లో అందరి దృష్టినీ ఒక మహిళ ఆకర్షించారు. ఆ మహాసభల్లో అన్ని ఏర్పాట్లనూ ఒంటిచేత్తో చక్కబెట్టిన ఘనత ఆమెది. ఇటు ప్రతినిధులను ఓ కంట కనిపెడుతూ... అటు వంటలు సరిగ్గా వున్నాయో లేవోనని తనిఖీచేస్తూ... స్టేజ్‌పై కార్యక్రమాలను చక్కబెడుతూ... అటు మీడియా ప్రతినిధులు వచ్చారో లేదోనని ఆరాతీస్తూ... క్షణం తీరికలేకుండా అటూ ఇటూ తిరిగేస్తూ అన్నీ తానై చక్కబెడుతున్న సుభాషిణీ ఆలీ ఆ మహాసభల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌. వయసును మరిచి ఆమెలో పరవళ్లు తొక్కుతున్న ఉత్సాహానికి ఆహుతులుసైతం అచ్చెరువొందారు. తామూ ఇనుమడించిన ఉత్సాహంతో మహాసభలను జయప్రదం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి