.

26, నవంబర్ 2010, శుక్రవారం

రాజానెందుకు ప్రశ్నించలేదు?

2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజాను ఎందుకు ప్రశ్నించలేదని సుప్రీం కోర్టు సిబిఐని నిలదీసింది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం తమను విస్మయానికి గురి చేసిందని న్యాయమూర్తులు జిఎస్‌ సింఘ్వి, ఎకె గంగూలీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పెక్ట్రమ్‌ కేటాయింపులను వేలం వేయటానికి బదులుగా తన ఇష్టం వచ్చినట్లు కేటాయించటం ద్వారా రాజా ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు 1.76 లక్షల కోట్ల మేర గండి కొట్టారని కాగ్‌, సివిసి తమ నివేదికల్లో వెల్లడించినప్పటికీ సిబిఐ వారిని ప్రశ్నించకుండా మౌనం వహించటం ఆశ్చర్యకరంగా ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి