గురువారం 2 జూన్ 2011

నేడు పాక్షిక సూర్యగ్రహణం

దిక్కుతోచని జి8 కూటమి

పెరుగుతున్న నిరుద్యోగం, తరుగుతున్న అభివృద్ధి వంటి సమస్యలతో దిక్కుతోచని స్థితిలో పడిన జి8 కూటమి దేశాలు ఇప్పుడు భవిష్యత్తు అన్వేషణలో పడ్డాయి. ఇటీవల ఫ్రాన్స్‌లోని నార్మండీ తీరంలో జరిగిన జి8 కూటమి భేటీ తరువాత ఈ దేశాల అధినేతలెవరూ ఇప్పుడు ప్రపంచ సమస్యలపై పెదవి విప్పటం లేదు. తమ సమస్యలను పరిష్కరించుకోవల్సిన పరిస్థితి ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం. అసలు ఏ సమస్యపై దృష్టి పెట్టాలన్న అంశంపై ఏకాభిప్రాయం...........................................

టిడిపి ఆత్మవిమర్శ పరివర్తనకు దారితీస్తుందా?

అధికారం కోల్పోయిన ఏడేళ్ల తర్వాతనైనా చంద్రబాబు తన విధానాల్లో లోపం ఉందని అంగీకరించడం ఆహ్వానించదగ్గ పరిణామమే. నూతన విధానాల రూపకల్పనకు మూడు అధ్యయన కమిటీలను కూడా నియమించారు. అయితే ఆర్థిక సంస్కరణల సమీక్ష కోసం ఎలాంటి కమిటీని నియమించకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాపితంగా ప్రపంచీకరణ విధానాలకు ఎదురవుతున్న ప్రతిఘటన, అమెరికాతో పాటు తాను ఆదర్శంగా చూపించిన సింగపూర్‌ సహా అనేక ధనిక దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం, మన రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పదేపదే ఓడిపోవడం, చంద్రబాబు మాటలను విశ్వసించలేమని వారి పార్టీ కార్యకర్తలే బహిరంగంగా అంగీకరిస్తుండటం వగైరా అనేక అంశాలు ఆయన్ను ఈ రకమైన ఆత్మవిమర్శకు పురికొల్పి ఉండొచ్చు................................................

పొగాకు ...సాంకేతిక, సామాజికాంశాలు

పొగాకు వినియోగ దుష్ప్రభావాల్ని గమనించిన 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' దీని వినియోగాన్ని తగ్గించటానికి మే 31ని 'ప్రపంచ పొగాకు తిరస్కరణ దినం (నో టొబాకో డే)' గా పాటించాలని నిర్ణయించింది. ఇందుకు168 దేశాలు అంగీకరించాయి. వీటిలో మన దేశం కూడా ఒకటి. దీని ప్రధాన ఉద్దేశం పొగాకు వినియోగాన్ని నిరుత్సాహపరచడం. దీని దుష్ప్రభావాలను ప్రచారం చేస్తూ, అలవాటుపడిన వారితో కనీసం 24 గంటలు పొగాకును మాన్పించడం ఇందులో భాగం. దీనిలో ఇమిడి వున్న సాంకేతిక, సామాజికాంశాలను రేఖామాత్రంగా వివరిస్తూ.. ఈ వారం మీ ముందుకొచ్చింది 'విజ్ఞానవీచిక'..................................

దర్శకత్వ ఆలోచన లేదు


బాలీవుడ్‌తో పాటు పలు భాషలలో సుమారు 175కి పైగా చిత్రాలలో నటించిన నటుడు జాకీష్రాఫ్‌. అతను ప్రప్రధమంగా ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ నేపధ్యగాయకుడు ఎస్‌పి. బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్‌పి.చరణ్‌ క్యాపిటల్‌ ఫిల్మ్‌ వర్క్స్‌ అనే పతాకంపై 'అరణ్య కాండం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్య్వూ ఇలా వుంది..................................................

ప్రజాశక్తి పుస్తక రథం ప్రత్యేకతలు

వైఎస్‌ఆర్‌ పేరుతో జగన్‌ రాజకీయం : బొత్స

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి రాజకీయపబ్బం గడుపుతున్నారని రవాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన సిఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతుల ముసుగులో ప్రతిపక్ష నేత చంద్రబాబు, కొత్త పార్టీ నేత జగన్‌ నాటకాలు ఆడుతున్నారని, రైతులకు తప్పుడు సంకేతాలు అందిస్తున్నారని విమర్శించారు. రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ టిడిపి, బిజెపి, ఇటీవల కొత్తగా వచ్చిన పార్టీ మాట్లాడుతున్నాయని, రాజకీయ పార్టీలు బాధ్యతతో కూడిన సలహాలు, సూచనలు ఇస్తే స్వాగతిస్తామన్నారు............

'ఆనందాన్ని ఆస్వాదించలేకపోయా' : ధనుష్‌

జాతీయ అవార్డు పొందినా ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయానని సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అల్లుడు, తమిళహీరో ధనుష్‌ అన్నారు. దక్షణాది భాషా చిత్రాలకు ఐడియా అందిస్తున్న ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల పరిచయ కార్యక్రమం చెన్నరులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయిన ధనుష్‌ మాట్లాడుతూ తనకు ఇంతవరకు ఎటువంటి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకోలేదన్నారు............