సోమవారం 24 జనవరి 2011

పది నిమిషాల్లో హెచ్‌ఐవి నిర్ధారణ

నాకు తగిన కథే ఎంచుకుంటా - నిత్యమీనన్‌

 'వాస్తవంగా నేను మలయాళీ. మా తల్లిదండ్రులు బెంగుళూరులో స్థిరపడ్డారు. నేను అక్కడే పుట్టాను. మణిపాల్‌ యూనివర్సిటీలో జర్నలిజం కోర్సు చేశాను. చిన్నతనం నుండీ నాకు వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ నేర్చుకోవాలని కోరికగా ఉండేది. అయితే మనం ఒకటి తలిస్తే, దైవం ఒకటి తలుస్తాడు కదా అందువల్ల కాలేకపోయాను' వివరిస్తోంది నూతన తార నిత్యమీనన్‌. తన తాజా చిత్రం 'అలా మొదలైంది' అనుభవాల్ని ఇలా వివరిస్తోంది..............

సిరీస్‌ దక్షిణాఫ్రికా వశం

దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక వన్డే సిరిస్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని భారత్‌ పోగొట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌ను 3-2 తో దక్షిణాఫ్రికా గెలుచుకుంది. సఫారీలు 1-2 తో వెనకబడ్డా వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హసీమ్‌ ఆమ్లా సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్‌ స్మిత్‌ ఏడు పరుగులు చేసి అవుటైన జట్టును ముందుండి నడిపించాడు. ఇక్కడ జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభంలోనే ఓపెనర్‌ కెప్టెన్‌ స్మిత్‌ వికెట్‌ను జహీర్‌ ఖాన్‌ పడగొట్టాడు.

తెలుగులో 'యామ్లా పాగ్లా దీవానా' !

 ఒక భాషలో హిట్టయిన సినిమాలను వెంటనే వేరే భాషలో రీమేక్‌ చేయడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైంది. తెలుగులో విజయం సాధించిన కిక్‌, రెడీ చిత్రాలను హిందీలో రీమేక్‌ చేస్తుండగా, లవ్‌ ఆజ్‌ కల్‌, దబాంగ్‌ చిత్రాలను తెలుగులో పునర్‌నిర్మాణం చేస్తున్నారు. ఇటీవల విజయం సాధించిన హిందీ చిత్రం 'యామ్లా పాగ్లా దీవానా'ను తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఒకప్పటి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ధర్మేంద్ర, అతని తనయులు సన్నిడియోల్‌, బాబీడియోల్‌ నటించారు. ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో మంచి వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు ..............

ఐదు రోజుల్లో ఐదుగురితో...దొంగలముఠా

 వర్మ తాజా స్టేట్‌మెంట్‌ 'దొంగలముఠా' విడుదలకు ముందే ఇండిస్టీలో చర్చకు తెరలేపింది. కారణం ఈ సినిమాని ఐదు రోజుల్లో తీస్తాననటమే. అంతేగాక సినిమా కోసం పనిచేసే వారికి ముందస్తు అడ్వాన్స్‌లు ఏమీ ఇవ్వనని కూడా ప్రకటించాడు. ఇంతకీ ఆయన సినిమా లాంటిదేదైనా తీస్తాడా ! సినిమానే తీస్తాడా ! కథేంటి ! మొదలైన సందేహాలకు వర్మఇలా సమాధానమిస్తున్నాడు..............

యాక్షన్‌, డ్రామా...లేకుండా తీశాం

అమీర్‌ఖాన్‌ భార్య కిరణ్‌రావు తీసిన 'దోభీఘాట్‌' విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అంతేగాక థియేటర్‌ వద్దా బాగానే వసూళ్లు నమోదు చేసుకుంది. పేయింటర్‌ అరుణ్‌ (అమీర్‌ఖాన్‌), ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ మోనికా దోగ్రా, ఓ ముస్లిం యువతి (క్రితీ మల్హోత్రా), బట్టలు ఉతికే దోభీ మున్నా (ప్రతీక్‌ బబ్బర్‌)...అనే నలుగురి వ్యక్తుల వ్యక్తుల కథే ఈ సినిమా. ముంబారు నగర ప్రస్తావన అత్యంత కీలకమైంది. దర్శకురాలు కిరణ్‌ మాటల్లో...'ఈ మహానగరంలో బతకడానికి ...........

గుట్కా కంపెనీలపై ఐటి దాడులు

దేశ వ్యాప్తంగా పాన్‌-మసాలా, గుట్కా తయారీదారుల వ్యాపార సంస్థలు, నివాస గృహాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పొగాకు ఉత్పత్తుల తయారీదారులకు సంబంధించి పద్నాలుగు రాష్ట్రాల్లో వున్న 69 ప్రదేశాలలో దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో వెయ్యి మందికిపైగా అధికారులు, భధ్రతా సిబ్బంది పాల్గొన్నారని వారు పేర్కొన్నారు. ఈ దాడుల్లో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో ఖాతాల్లో చూపని సొమ్మును డిపార్టుమెంటు స్వాధీనం చేసుకుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సిబిడిటి) తెలిపింది................