.

31, జనవరి 2011, సోమవారం

మిన్నంటిన నిరసనలు

అధ్యక్షుడు హోష్నీ ముబారక్‌ ముర్దాబాద్‌ అంటూ ఆందోళన కారులు గత మంగళవారం ప్రారంభించిన నిరసన ప్రదర్శనలు ఈజిప్టును ఇంకా కుదిపేస్తూనే ఉన్నాయి. నిరసనకారుల అదుపు చేయాలని విధించిన నిషేధాజ్ఞలను ధిక్కరించి మరీ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళన కారులను అదుపు చేయడం లక్ష్యంగా సైన్యాన్ని రంగంలోకి దింపారు. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్న సైన్యానికి ఆందోళన కారులు జడవక పోగా సాదర స్వాగతం పలకడం విశేషంగా చెప్పాలి. శాంతిభద్రతల పరిరక్షణ పేరిట మోహరించిన సాయుధ బలగాలు, ఆందోళన కారుల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొనలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి