.

24, జనవరి 2011, సోమవారం

సిరీస్‌ దక్షిణాఫ్రికా వశం

దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రక వన్డే సిరిస్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని భారత్‌ పోగొట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌ను 3-2 తో దక్షిణాఫ్రికా గెలుచుకుంది. సఫారీలు 1-2 తో వెనకబడ్డా వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హసీమ్‌ ఆమ్లా సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్‌ స్మిత్‌ ఏడు పరుగులు చేసి అవుటైన జట్టును ముందుండి నడిపించాడు. ఇక్కడ జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభంలోనే ఓపెనర్‌ కెప్టెన్‌ స్మిత్‌ వికెట్‌ను జహీర్‌ ఖాన్‌ పడగొట్టాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి