న్యూఢిల్లీ : పార్టీ వ్యతిరేక ఆరోపణలు చేసిన వినోద్ కుమార్ బిన్నీపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ఆప్ సిద్ధమైంది. పార్టీకి వ్యతిరేకంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బిన్నీపై క్రమశిక్షణా చర్య తీసుకుంటామని పార్టీ సీనియర్ నేత యోగేంద్రయాదవ్ చెప్పారు. గురువారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీపై బిన్నీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించినందుకే పార్టీపై ఆయన 'నిరాధారమైన నిందలు' మోపుతున్నారని అన్నారు. 'బిన్నీపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తాము' అని యాదవ్ వివరించారు. పార్టీ సభ్యులు విభిన్న అభిప్రాయాలు కలిగివున్నప్పటికీ, read more...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి