.

17, జనవరి 2014, శుక్రవారం

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా!



- సినీ నటుడు కృష్ణంరాజు 
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌:
   రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బి.జె.పి) తరఫున పోటీ చేయనున్నట్లు సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు. కృష్ణంరాజు తెలిపారు. గురువారం రాత్రి ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ఈ సంగతి వెల్లడించారు. కొన్నాళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కృష్ణంరాజు ఇటీవల మళ్ళీ బి.జె.పి.లో చేరిన సంగతి తెలిసిందే. గతంలో కాకినాడ, నరసాపురం పార్లమెంటరీ స్థానాల నుంచి బి.జె.పి. తరఫున నిలిచి, గెలిచిన ఆయన ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేయనున్నదీ చెప్పలేదు. ''పార్టీ నిర్ణయించిన స్థానంలో పోటీ చేస్తా'' అని ఆయన 'ప్రజాశక్తి'తో అన్నారు. మునుపటి నియోజక వర్గాల్లో తన పని తీరు బాగున్నందు వల్ల ఇప్పుడు ఇతర స్థానాల నుంచి కూడా తనను పోటీ చేయమంటూ అభ్యర్థనలు వస్తున్నాయని ఆయన అంటున్నారు. read more...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి