.

8, జనవరి 2014, బుధవారం

పాటల్లో 'తను మొన్నే వెళ్లిపోయింది'

    
తెలుగు సినిమా దర్శకుల్లో భిన్నమైన శైలిని చూపిన దర్శకుడు వంశీ. పల్లె అందాల్ని మెప్పించే రీతిలో చూపించడం, కుటుంబ విలువలతో కూడిన చిత్రాల్ని తెరకెక్కించడంలో ఆయన మేటి. తాజాగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తను మొన్నే వెళ్లిపోయింది'. ఆయన దర్శకత్వంలో వస్తున్న 25వ చిత్రమిది. శ్రీయాస్‌ చిత్ర పతాకంపై పూర్ణ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'రంగం' ఫేం అజ్మల్‌, నిఖితా నారాయణ్‌ నటిస్తున్నారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
వి.వి.వినాయక్‌, మల్టీడైమన్షన్‌ వాసు, ఎమ్‌.ఎల్‌ పద్మకుమార్‌ చౌదరి, పుప్పాల రమేష్‌, నందినీరెడ్డి, ప్రభుత్వవిప్‌ అనిల్‌, బివిఎస్‌ రవి, హర్షవర్ధన్‌ తదితరులతోపాటు చిత్ర గాయనీగాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.red more...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి