.

30, డిసెంబర్ 2013, సోమవారం

'అనంత విషాదం'పై ఆధారాల సేకరణ

  ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి
అనంతపురం జిల్లా కొత్తచెరువు వద్ద జరిగిన నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై విచారణ మొదలైంది. రైల్వే, ఫోరెన్సిక్‌, పోలీసులు విడివిడిగా విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించే పని చేపట్టారు. రైల్వేబోర్డు ఛైర్మన్‌ అరుణేంద్రకుమార్‌ ఆదివారం ఉదయాన్నే పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన బోగిని ఆయన పరిశీలించారు. అనంతరం సంఘటనా స్థలానికెళ్లి తనిఖీ చేశారు. మరోవైపు ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం శనివారం సాయంత్రమే పుట్టపర్తికి చేరుకుంది. డిఎన్‌ఎ విభాగపు నిపుణులు, పేలుడు, రసాయనిక విభాగపు నిపుణులు, క్లూస్‌ విభాగపు నిపుణులు ఈ బృందంలో ఉన్నారు.read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి