తనకు పెళ్లి అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెబుతోంది నిన్నటి
తరం నాయిక సంఘవి. 1994లో 'తాజ్మహల్' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన
ఈ కన్నడ తార ఆమధ్య పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోయినట్టు వార్తలు
వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వార్తలను తాజాగా సంఘవి ఖండించింది.
'నేనింకా పెళ్లి చేసుకోలేదు. అలాగే నాపై ప్రచారం జరుగుతున్నట్టుగా నేను
నటనకు స్వస్తి చెప్పలేదు. అయితే, ఇంట్లో వాళ్లు మాత్రం సంబంధాలు
చూస్తున్నారు' అని తెలుపుతోంది సంఘవి.
read more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి