.

30, డిసెంబర్ 2013, సోమవారం

బాధితుల మృత్యుఘోష.. సరదాల్లో సర్కారు

  -ఇదీ అఖిలేష్‌ ప్రభుత్వ తీరు
సైఫై (యుపి) : ముజఫర్‌నగర్‌, షామిలి జిల్లాల్లో సెప్టెంబర్‌లో జరిగిన మత ఘర్షణల బాధితులు గడ్డకట్టించే చలిలో మృత్యుఘోష పెడుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తన స్వగ్రామం సైఫైలో రెండు వారాల ఉత్సవాలలో మునిగిపోయారు. పైగా వీటిని దశాబ్దకాలం నుండి తమ పార్టీ సంప్రదాయకంగా జరుపుకుంటోందంటూ ఆయన నిస్సిగ్గుగా సమర్ధించుకున్నారు. సైఫైలో తనను కలిసిన మీడియా ప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాల కవరేజి కోసం రాలేదన్న సంగతి తనకు తెలుసని, ఒకవైపు సహాయ శిబిరాల్లో బాధితులను చూపుతూనే మరో వైపు ఈ ఉత్సవాలను కూడా చూపుతుంటారని ఎద్దేవా చేశారు. ముజఫర్‌ నగర్‌ అల్లర్లు జరిగి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా బాధితులను పరామర్శించని అఖిలేష్‌ ఆయన తండ్రి ములాయంలు ఇప్పుడు ఉత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం నాడు ఇక్కడికి చేరుకున్నారు.read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి