.

22, మార్చి 2011, మంగళవారం

రచ్చబండ హామీలు గాలికి!

ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకులు, అధికారులు పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన రచ్చబండ కార్యక్రమం వల్ల ప్రజలకు ఎలాంటి మేలూ ఒనగూడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించారు. రెండు నెలల క్రితం రచ్చబండలో ఇచ్చిన హామీలు నేటికీ అమలుకావడం లేదు. వారం రోజుల్లో మీ సమస్యలు పరిష్కారిస్తామని చెప్పిన ఉన్నతాధికారులు ఆ దిశగా ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి