.

28, ఫిబ్రవరి 2011, సోమవారం

వారసత్వం నాకులేదు: అక్కినేని

''నటనలో వారసత్వం నాకులేదు. మా తల్లిదండ్రులకు ఆ గొడవేతెలీదు. నా తర్వాత వారికి అది వచ్చింది. అదేవిధంగా కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌కు ఆయన తర్వాత వారసత్వం వచ్చింది. ఆయన మంచి వ్యక్తి. ఆయన లక్షణాలను ఆయన ముగ్గురు కుమారులు పుణికిపుచ్చుకున్నారని'' అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. పునీత్‌రాజ్‌కుమార్‌ నటించిన 'జాకీ' చిత్రాన్ని తెలుగులో సూరజ్‌ ఫిలింస్‌ బేనర్‌పై నాదెళ్ళ సుజాత విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథి అల్లు అర్జున్‌ ఆడియోసీడీని విడుదలచేసి అక్కినేనికి, కైకాలకు అందజేశారు. ఈ సందర్భంగా అక్కినేని... రాజ్‌కుమార్‌తో తనకుగల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి