ఆధునిక కాలంలో శాస్త్రీయ ఫలాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ప్రధాని మన్మోహన్సింగ్ పిలుపునిచ్చారు. శాస్త్ర విజ్ఞాన ఉత్పత్తులను స్వార్థ, సంకుచిత ప్రయోజనాలకు చేరువకాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇక్కడికి 40కిమీ దూరంలోని కట్టనకుళత్తూర్లోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన 98వ భారత సైన్స్ మహాసభలను ప్రారంభించిన అనంతరం సోమవారం ఆయన మాట్లాడుతూ ఏ తరహా సమాజంలోనైనా సైన్స్ ఎన్నో ఒడిదుడుకులను చవి చూసిందన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి