'తెలంగాణా ప్రాంతంలో మనుషులూ, మనసులు ఎప్పుడో విడిపోయాయి. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధతే తరువాయి. 6న ఢిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో చట్టబద్ధత వస్తుందని మేము ఆశిస్తున్నాం' అని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్ధనరెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఏకాభిప్రాయం పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. శనివారం టిడిఎల్పి కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి