తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నిరవధిక దీక్ష మంగళవారానికి ఐదో రోజుకు చేరింది. ఎఐసిసి సమావేశాల్లో మూడు రోజులపాటు ఢిల్లీలో గడిపిన ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్కొచ్చాక బాబు దీక్షపై దృష్టి సారించారు. మంగళవారం సాయంత్రం ప్రభుత్వంలో కొద్దిపాటి కదలికొచ్చింది. అందుబాటులో ఉన్న మంత్రులతో సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమాలోచనలు జరిపారు. మంత్రుల బృందాన్ని చంద్రబాబు వద్దకు పంపి దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి