.

28, డిసెంబర్ 2010, మంగళవారం

2 జి కుంభకోణం పిఎసికి కాగ్‌ వివరణ

బిజెపి నేత మురళీ మనోహర్‌ జోషి ఆధ్వర్యంలోని ప్రజాపద్దుల కమిటీ(పిఎసి) ఎదుట భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) వినోద్‌ రారు సోమవారం హాజరయ్యారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంపై సమర్పించిన నివేదికలోని అంశాలను జోషికి సంక్షిప్తంగా వివరించారు. దాదాపు రూ.1.76 లక్షల కోట్ల కుంభకోణాన్ని వెలికి తీసేందుకు తాము ఏ విధంగా తనిఖీలు చేపట్టిందీ విపులీకరించారు. స్వతంత్ర భారత చరిత్రలోనే 2జి కుంభకోణం అతి పెద్దది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) వేయడం ద్వారానే ఈ కుంభకోణానికి సంబంధించిన వాస్తవ విషయాల వెల్లడవుతాయని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి