''అమ్మాయి కోసం వెంటపడే అబ్బాయిల్ని చూశాం. అలాగే అబ్బాయి ప్రేమ కోసం తపించే అమ్మాయిల్ని కూడా చూశాం. ఇద్దరూ మ్యూచ్వల్ అండర్స్టాండింగ్తో ఒకటైన జంటల్ని కూడా గమనించాం. ఇవేమీ కాకుండా కొత్త తరహా ప్రేమ కథని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం'' అని నూతన దర్శకుడు రాజశేఖర్ ఎ.ఎమ్ అన్నారు. అనూప్తేజ్, ప్రణమ్య, యశ్వంత్ నటీనటులుగా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నిన్ను చూసి వెన్నెలె అనుకున్నా'. నీహారిక సినిమాస్ పతాకంపై టి.విజయ వాసుదేవారెడ్డి నిర్మిస్తున్నారు. ఘంటసాల విశ్వనాథ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. see more.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి