.

31, మార్చి 2011, గురువారం

వైఎస్‌, బాబు జాతకాలు బయటపడ్తాయి

భూ కేటాయింపులపై వేయబోతున్న సభాసంఘం ద్వారా తప్పులున్నట్లు తేలితే మాజీ ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు జాతకాలు బయటికొస్తాయని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో డిఎస్‌ మాట్లాడారు. భూ కేటాయింపులపై ప్రభుత్వం సభాసంఘం వేయడాన్ని తప్పుపట్టడం సరైంది కాదని చెప్పారు. సభాసంఘం వేయకుంటే ఏదో గూడుపుఠాణీ ఉందంటారని, వేస్తే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటే ఎలా అని జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని టార్గెట్‌ చేసుకోవాలంటే చాలా రకాలున్నాయని, ఆ ఉద్దేశం తమకు లేదని తెలిపారు. భూ కేటాయింపులు చంద్రబాబు, వైఎస్‌ హయాంలోనే జరిగాయని, సిపిఐ(ఎం), బిజెపి లాంటి పార్టీలు పాలించలేదని, తప్పు తేలితే ఆ ఇద్దరి వ్యవహారమే బయటికొస్తుందని........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి