.

6, మార్చి 2011, ఆదివారం

వర్ధమాన దేశాలకు క్యాన్సర్‌ ముప్పు

క్యాన్సర్‌ వ్యాధిని నివారించే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లకపోతే 2030 నాటికి తృతీయ ప్రపంచ దేశాల్లో 70 శాతం క్యాన్సర్‌ పీడితులుంటారని ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణురాలు డాక్టర్‌ వి.శాంత చెప్పారు. విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ పేరిట బహుకరించే ప్రతిష్టాత్మక అవార్డును శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర హైకోర్టు జస్టిస్‌ ఎన్‌ వి.రమణ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నాయుడమ్మ 19వ స్మారకోపన్యాసం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటీ 10 లక్షల మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 60 లక్షలు, మిగిలిన దేశాల్లో 40 లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి