.

14, ఫిబ్రవరి 2011, సోమవారం

ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడాన్ని మాలమహానాడు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్సీ, మాలమహానాడు అధ్యక్షులు జూపూడి ప్రభాకార్‌రావు తెలిపారు. వర్గీకరణను ఎదిరించడానికి మాలమహానాడు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14, 15 తేదిల్లో మండల, జిల్లా వ్యాప్త ధర్నాలు చేయాలని నిర్ణయించినట్టు హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూపూడి తెలిపారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన వర్గీకరణ అంశాన్ని ఆచరణలో పెట్టడానికి, తన కుటిల నీతిని చాటుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి