ఈజిప్టులో బుధవారం తొమ్మిదవ రోజు కూడా అనిశ్చితితోనే తెల్లవారింది. తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తరువాత మరోసారి పోటీ చేయబోనని అధ్యక్షుడు హోస్నీ ముబారక్ వాగ్దానం చేశారు. అయితే నిరసనకారులు దాన్ని తిరస్కరించారు. ఆయన తక్షణం దిగిపోవాల్సిందేనని డిమాండ్ చేశారు. బుధవారం సూర్యోదయమయ్యే సరికే కైరోలోని తహ్రీర్ స్క్వేర్ పూర్తిగా కుటుంబాలు, చిన్న పిల్లలతో సహా ప్రదర్శకులతో క్రిక్కిరిసి పోయింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి