ఈ నెల 19న ప్రారంభం కానున్న ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఆశలన్నీ సచిన్ టెండూల్కర్పైనే ఉన్నాయని 1983లో ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యునిగా ఉన్న బల్విందర్ సింగ్ సంధు వ్యాఖ్యా నించాడు. భారత జట్టులో ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్న సచిన్ టెండూల్కర్తోపాటు యువరాజ్ సింగ్, స్కిప్పర్ ధోనీ, యూసుఫ్ పఠాన్ వంటి అనేకమంది మ్యాచ్ విన్నర్లున్నారని అన్నాడు. సచిన్ పూర్తిగా ప్రపంచకప్పైనే పూర్తిగా తన దృష్టి కేంద్రీకరిస్తున్నాడని పేర్కొన్నాడు. సచిన్కు ఇది చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉందని అన్నాడు. తరువాత ఎక్కువకాలం అతడు ఆడక పోవచ్చునన్నాడు......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి