శ్రీకృష్ణ కమిటీపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, నేతల స్వరం మారింది. కమిటీ నివేదికకు కట్టుబడతామని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన నేతలు ఆదివారం అందుకు భిన్నంగా శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికను రహస్యంగా ఉంచాల్సిన కమిటీ సభ్యులు దానిలోని అంశాలను మీడియా ముందు బహిర్గతం చేశారని తప్పు బట్టారు. శ్రీకృష్ణ నివేదికపై బహిరంగంగా వ్యాఖ్యానించొద్దంటూ పార్టీ హైకమాండ్ ఆదేశించి రెండు రోజులన్నా కాక ముందే ధిక్కార స్వరం వినిపించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి