.

2, జనవరి 2011, ఆదివారం

కొత్త వత్సర ప్రారంభదినాన మరో ఐదుగురు రైతులు బలి

క్యాలెండరు మారినా సమస్యలు అలాగే ఉన్నాయనేందుకు ఉదాహరణే కొత్త సంవత్సరం ప్రారంభ దినాన మరో ఐదుగురు రైతులు బలవన్మరణం చెందారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం బాలాపురం గ్రామానికి చెందిన రైతు కృష్ణమూర్తి(40) అప్పుల బాధతాళలేక ఉరేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణమూర్తి తన ఐదెకరాల పొలంతోపాటు మరో మూడెకరాలు కౌలు చేశాడు. అందులో వేరుశనగ సాగు చేశాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి