పాలనలో లోపాలు, బలహీనతలను అధిగమిస్తామని ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన తన సందేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. గత ఏడాదిలో ఎదురైన పరిణామాలు, సంఘటనలు గుర్తు చేసుకుంటూ, ఇది కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సిన సమయమని అన్నారు. కొత్త ఏడాదిలో పాలనా ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు రెట్టింపు కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి