రైతు సమస్యలు పరిష్కరించాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ పివి రమేష్ తెలిపారు. చంద్రబాబు దీక్ష చేపట్టి బుధవారానికి ఆరు రోజులు పూర్తి కావడంతో ఆయన ఆరోగ్యంపై రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఫ్లూయిడ్స్ తీసుకోకుంటే ఏమైనా జరిగే అవకాశముందని, ముందుగా గుండె పనితీరుపైనే ప్రభావం పడుతుందని చెప్పారు. ఐసియులోకి తీసుకెళ్తామని చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు చెప్పామని, దానికి ఆయన నిరాకరించారని తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి