ఆంధ్రప్రదేశ్ రైతుల సమస్యలపై ఉదాసీన వైఖరిని విడనాడాలని ప్రధాని మన్మోహన్కు వామపక్షాలు సహా ఏడు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సాయం ఏమాత్రం సరిపోదని స్పష్టం చేశాయి. నష్టపోయిన వరి రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలు, వాణిజ్య పంటల రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు సాయంగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి