ఉప్పు, చక్కర రవాణా ఛార్జీలను రైల్వే శాఖ పెంచింది. అవే కాకుండా ముడి ఇనుము, ఉక్కు, బొగ్గు, సిమెంట్, కాస్టిక్ పొటాష్, పెట్రోలియం ఉత్పత్తులపై 4 శాతం మేరకు రవాణా ఛార్జీలను పెంచింది. నూతన ఛార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయి. రైల్వేల నిర్వహణ ఖర్చు, ఇంధన ఛార్జీలు, ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాలు పెరగడం వల్ల సరుకు రవాణా ఛార్జీలను పెంచక తప్పడం లేదని సీనియర్ అధికారి ఒకరు రైల్ భవన్లో మీడియాతో అన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి