.

9, డిసెంబర్ 2010, గురువారం

చిలీ జైలులో అగ్ని ప్రమాదం :81మందికి పైగా మృతి

చిలీలోని ఒక జైలులో బుధవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీసం 81 మందికి పైగా ఖైదీలు మరణించారని, మరో 14 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. శాంటియాగో నగరం దక్షిణాన వున్న శాన్‌మిగుఎల్‌ జైలులో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5-30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని జాతీయ జైళ్ల డైరెక్టర్‌ లూయిస్‌ మాస్ఫెరర్‌ చెప్పారు. ఈ ప్రమాద వార్తవిన్న ఖైదీల బంధువులు భయభ్రాంతులై జైలు గేట్ల వద్దకు చేరిన దృశ్యాలను కొన్ని టీవీ ఛానల్స్‌ ప్రసారం చేశాయి. జైలు గేట్లు మూసివుండటంతో అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి సకాలంలో చేరుకోలేకపోయారని, మూడు గంటల పోరాటం అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి