.

29, డిసెంబర్ 2010, బుధవారం

హైతీలో కలరా మరణాలు 2,707

హైతీలో అక్టోబర్‌లో అకస్మాత్తుగా పెచ్చరిల్లిన కలరా వ్యాధి వల్ల 2,707 మరణాలు సంభవించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంకా ఈ వ్యాధి దేశవ్యాప్తంగా 1,28,251 మందికి సోకినట్లు తెలిపింది. ఈ వ్యాధి దేశం మొత్తానికీ వ్యాపించిందని, ఉత్తర ప్రాంతంలోని ఆర్టీబోనైట్‌లో తీవ్ర రూపంలో ఉందని ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. దక్షిణ ప్రాంత రాష్ట్రం నిప్పెస్‌లో తాజాగా వ్యాధి వ్యాపించి 44 మంది మృతి చెందినట్లు వార్తలందాయి. దేశ నైరుతీ ప్రాంతంలోని గ్రాండ్‌ అన్సేలో పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రజలలో చైతన్యం పెంపొందించేందుకు, ఆరోగ్య చర్యల గురించి వారికి తెలియజేసేందుకు, ప్రధా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి