ఒబామా పర్యటన పూర్తయ్యింది. మన దేశం నుండి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలించుకు పొయ్యాడు. వాళ్ల దేశంలో 72వేల ఉద్యోగాలు కాపాడుకున్నాడు. కానీ మనకు ఒరిగింది ఏమిటి ? ఈ విషయాలు ఏమీ పట్టనట్లు ప్రధాన మంత్రి మాత్రం సియోల్లో అంతర్జాతీయ స్వేఛ్చా వాణిజ్యం, భారతదేశ పెట్టుబడులకు ప్రాధాన్యత స్థానం కల్పించటం వంటి విషయాల గురించి చర్చిస్తున్నారు. ఇది ఆయన తప్పు కాదు. సహవాస దోషం. ఒకసారి అగ్రరాజ్యంగా మనలను మనం భావించుకోవటంతో పాటు మిగిలిన వాళ్లు (అమెరికా) కూడా గుర్తించటం ప్రారంభిస్తే మన ప్రాధాన్యతలు కూడా మారిపోతాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి