.

23, జులై 2012, సోమవారం

దాదా జీత్‌గయా ....

 అనుకున్నట్లే జరిగింది. ప్రణబ్‌ ముఖర్జీ దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు అనంతరం ప్రణబ్‌ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తం ఓట్లలో ప్రణబ్‌కు 69.31 శాతం ఓట్లు పోలవగా, ఆయన ప్రత్యర్థి పిఎ సంగ్మాకు 30.69 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ప్రణబ్‌కు పోలైన ఓట్ల విలువ 7,13,937 కాగా, సంగ్మాకు పోలయిన ఓట్ల విలువ 3,15,987. పోలైన మొత్తం ఓట్ల విలువ 10,29,924. అవసరమైన ఓట్ల విలువ 5,25,140 కంటే ఎంతో ఎక్కువగా సాధించారు........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి