.

4, మార్చి 2011, శుక్రవారం

కెసిఆర్‌కు అద్వానీ షాక్‌

టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ గురువారం పెద్ద షాక్‌ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ డిమాండుతో లోక్‌సభా కార్యక్రమాలను అడ్డుకోవడం తగదన్న అద్వానీ వ్యాఖ్యలతో ఆశ్యర్యపోవడం కెసిఆర్‌ వంతైంది. పలు వాయిదాల అనంతరం లోక్‌సభ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైంది. ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ టిఆర్‌ఎస్‌ ఎంపీలు కెసిఆర్‌, విజయశాంతితో పాటు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు మరోసారి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎల్‌కె అద్వానీ మాట్లాడుతూ... 'ప్రస్తుతం తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం వాస్తవం. అయితే తెలంగాణ డిమాండుతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదు. పార్లమెంటును ఉయోగించుకుని,...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి