.

8, మార్చి 2011, మంగళవారం

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

అనుమానం రాకుండా ఓ ఇంట్లో ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లక్షా పదివేల రూపాయలు, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ జోన్‌ ఏసిపి సత్యనారాయణ తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాల వెళ్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్‌టౌన్‌ జోజి నగర్‌లోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా ఆన్‌లైన సహాయంతో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారన్నారు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్‌ పోలీసులు, టాస్క్‌ ఫోర్సు సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించి నింధితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి