.

8, మార్చి 2011, మంగళవారం

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం

తెలంగాణకు టిడిపి కట్టుబడి ఉందని ఆ పార్టీ పునరుద్ఘాటించింది. టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్‌ నాగం జనార్ధనరెడ్డి సోమవారం అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ఫోరం చర్చించింది. నాగం వద్దకు ఫోరం బృందాన్ని పంపాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం ఫోరం సభ్యులు చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో సమావేశయ్యారు. తెలంగాణకు వ్యతిరేకం కాదన్న అంశాన్ని నాగంతో చర్చించాలని నిర్ణయించింది. కలిసి కట్టుగానే తెలంగాణ కోసం ఆందోళన చేయాలని, అది ఫోరం ఆధ్వర్యంలోనే జరగాలని అభిప్రాయపడింది. 10న జరగనున్న మిలియన్‌ మార్చ్‌కు ఫోరం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఎమ్మెల్యేలతోపాటు కార్యకర్తలు, నాయకులు మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి