.

5, మార్చి 2011, శనివారం

బహ్రెయిన్‌లో ఘర్షణలు

సున్నీ పాలిత రాజ్యం బహ్రెయిన్‌లో రెండు వారాల క్రితం నిరసనలు ప్రారంభమైన నాటి నుంచి మొదటిసారిగా శుక్రవారం జాతుల హింస జరిగింది. సున్నీలు, మెజారిటీ షియా ముస్లిముల మధ్య ఒక పట్టణంలో జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. రాజధాని మనామా వెలుపల బైఠాయించి ఉన్న నిరసనకారులు రాజకీయ సంస్కరణలు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో షియాలకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. షియాలు చాలా కాలంగా తమకు ద్వితీయ శ్రేణి హోదా కల్పిస్తున్నారని, వివక్షకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని ఖండిస్తోంది. బేషరతుగా చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బహ్రెయిన్‌ ప్రతిపక్ష గ్రూపులు సంసిద్ధత వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనో ఈ ఘర్షణలు జరిగాయి............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి