.

20, డిసెంబర్ 2010, సోమవారం

లూటీ విధానాల్ని తిప్పికొట్టాలి

దేశంలోని సహజ సంపదను, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న పాలకుల విధానాల్ని ప్రజా పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం మనదేశ ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2జి-స్పెక్ట్రమ్‌, కామన్‌వెల్త్‌ క్రీడలు, ఆదర్శ్‌ ఫ్లాట్ల కేటాయింపు, కర్నాటకలో జరిగిన భూముల స్కాం తదితర కుంభకోణాల్లో లూటీ అయిన ప్రజాధనంతో దేశంలో అందరికీ విద్య, ఆహారభద్రత తదితర సౌకర్యాలను కల్పించవచ్చన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి