ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకూ తన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన్ని సోమవారం తెల్లవారు ఝామున పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అన్ని పంటలకూ కనీస మద్దతు ధరలు చెల్లించేంత వరకూ, విపత్తు బాధితులకు సరైన నష్ట పరిహారం అందించేంత వరకూ దీక్ష కొనసాగుతుందన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి