.

18, నవంబర్ 2010, గురువారం

ఎడ్యూరప్ప భూదందా

కర్నాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప ప్రభుత్వ భూముల్లోని ప్లాట్లను తన కుమారులకు, అల్లుడికి, కోడలికి ధారాదత్తం చేసిన వైనంపై మరికొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఎడ్యూరప్ప భూదందా తవ్వే కొద్దీ పెరుగుతూ మరిన్ని వాస్తవాలను కళ్లకు కడుతోంది. ఒక కేసులో ఈ ఏడాది మే 14న ఎడ్యూరప్ప 11.25 హెక్టార్లు (ప్రస్తుత అంచనాల ప్రకారం 181 కోట్ల విలువైన) భూమిని డినోటిఫై చేశారు. అర్కావతి లే అవుట్‌గా పేరుపెట్టిన రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం బెంగళూరు నగరాభివృద్ధి సంస్థ 2004, ఫిబ్రవరి 23న భూమిని సేకరించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి