న్యూఢిల్లీ : 65వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రేహౌండ్స్ ఎస్ఐ కె ప్రసాద్బాబుకు మరణానంతరం అశోకచక్ర పురస్కారాన్ని అందజేశారు. గత ఏడాది ఆంధ్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులతో జరిగిన పోరాటంలో ఎస్ఐ ప్రసాద్ మరణించారు. ఆదివారం గణతంత్రదినోత్సవ పరేడ్ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఈ పురస్కారాన్ని ప్రసాద్ తండ్రి కె. వెంకటరామయ్య అందుకున్నారు. గతేడాది ఏప్రిల్ 16న ఆంధ్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు పేలుడుకు పాల్పడి, ప్రసాద్ నేతృత్వంలోని గ్రేహౌండ్స్ బృందంపై కాల్పులు జరిపారు. read more.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి