న్యూఢిల్లీ: యుపిఎ ప్రభుత్వం మైనార్టీల ప్రోత్సాహానికి వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి వుందని, ఈ దిశగా తగిన చర్యలు తీసుకుంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఉద్ఘాటించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నేషనల్ వక్ఫ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (నవాడ్కో)ను ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల ద్వారా స్కూళు ్ల, కళాశాలలు,ఆస్పత్రుల వంటి సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన ఆర్థికవ నరులను నవాడ్కో ద్వారా సమకూర్చుకోవచ్చని అన్నారు. మన దేశంలో నివశిస్తున్న మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒకటని ఆయన చెప్పారు. read more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి