.

6, నవంబర్ 2013, బుధవారం

ఉగ్రవాదులకు లక్ష్యంగా మారుతున్నాం

విధినిర్వహణలో చిత్తశుద్ధి, నిబద్ధత అవసరం - ఐపిఎస్‌లకు రాష్ట్రపతి ప్రణబ్‌ ఉద్బోధ   ప్రజాశక్తి-హైదరాబాద్‌బ్యూరో   ఉగ్రవాదులకు భారత్‌ లక్ష్యంగా మారుతోందని, దీన్ని కట్టడి చేయడంలో భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. సరిహద్దుల్లో ఉగ్రవాదులు సృష్టిస్తున్న ఆకృత్యాలకు భద్రతా దళాలు ధీటైన సమాధానమిస్తున్నాయని చెప్పారు. సామాన్యులకు సహాయం చేసినపుడే పోలీసులు తమ వృత్తికి న్యాయం చేసినవారవుతారని ప్రణబ్‌ తెలిపారు. సాయం కోసం తమ వద్దకు వచ్చే సామాన్యులకు పోలీసులు, ముఖ్యంగా యువ ఐపిఎస్‌లు సాంత్వన కలిగించే విధంగా వ్యవహరించి చేయూతనందించాలని ఆయన పిలుపునిచ్చారు. సివిల్‌ సర్వెంట్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి