తల్లి పూర్తిగా నిరక్షరాస్యురాలు, తండ్రి రోజువారీ కూలి పనులు చేసుకుంటారు. కానీ కూతురు మాత్రం ఏడేళ్ల వయస్సులోనే పదో తరగతి,13 ఏళ్ళ వయస్సులోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత పొందింది. ప్రతిభ అనేది కులం మీదో, సామాజిక స్థితిగతుల మీదో ఆధారపడి ఉండదు. ఈ సత్యానికి నిలువెత్తు నిదర్శనం ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సుష్మావర్మ.
ఇప్పుడే కాదు, కొన్నేళ్ళ కిందటే పదవతరగతి ఉత్తీర్ణులైన వారిలో, దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా ఈ అమ్మాయి వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఇంకోటి కూడా ఉంది. సుష్మ 2007లో ఏడేళ్ళ వయస్సుకే పదవ తరగతి పాసై, రికార్డును అధిగమించింది. ఆ రికార్డు ఎవరిదో కాదు తన సొంత అన్నయ్యదే. సుష్మా అన్న పేరు శైలేంద్ర. తొమ్మిదేళ్ళ వయస్సులో ఉత్తరప్రదేశ్ హైస్కూల్ నుండి పదవ తరగతిలో ఉత్తీర్ణత పొంది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. ఈ ఇద్దరు బాల మేధా వులను కన్న తల్లితండ్రులు ఇద్దరికీ చదువు లేదు. ఆస్తి అంతస్థులు అంతకన్నా readmore
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి