సోమవారం 30 జనవరి 2012

ఎస్సెమ్మెస్‌లకు కాలం చెల్లుతోందా ... ?

 ఎస్సెమ్మెస్‌... సమాచార వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన అధునాతన వారధి. సందర్భం ఏదైనా కావచ్చు. చివరకు క్లాసురూమ్‌లో వుండి కూడా మెసేజ్‌లు పంపుకోవడానికి అలవాటుపడిన నేటి తరం కొన్నాళ్లుగా వాటి జోరు తగ్గించేసిందట. మామూలు రోజుల సంగతి పక్కన పెడితే పండుగలు, వేడుకల సమయంలో వందల ఎస్సెమ్మెస్‌లు ఇచ్చిపుచ్చుకునేవారు. ఇవన్నీ నిన్నటి విషయాలు. ఇప్పుడు నెట్‌లో వచ్చిన కొన్ని ఉచిత సదుపాయాల వల్ల ఎస్సెమ్మెస్‌ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎక్కువగా గూగుల్‌ టాక్‌లు, యాహూ చాట్‌లపైనే ఆధారపడుతున్నారు. దీంతో పాటు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్లు కూడా ఎస్సెమ్మెస్‌ ప్రత్యామ్నాయమయ్యాయి. బ్లాక్‌బెర్రీ, ఐఫోన్ల వంటివి చేతిలో వుంటే... ఇక ఫోన్‌లోనే చాటింగ్‌లు చేసేసుకుంటున్నారు. దీంతో కొత్త టెక్నాలజీల వల్ల ఎస్సెమ్మెస్‌లకు కాలం చెల్లుతోందని పరిశీలకుల అభిప్రాయం.........

పోలీసు, విద్యుత్‌ అధికారుల వేధింపులు గిరిజన మహిళ ఆత్మహత్య

ఖమ్మంలో ప్రతిధ్వనించిన కవిత్వ భేరి

రాజ్యాంగ పితకు కుల మూద్రా?

హిందీలో రీమేక్‌ చేస్తారా !

ఏ చిత్రం హిట్‌ కొట్టినా.........హిందీలో రీమేక్‌ చేస్తారా !

మాస్టర్‌ డౌన్‌

 మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో స్థానం కోల్పోయాడు. ఐసిసి తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో సచిన్‌కు 13వ ర్యాంక్‌ దక్కింది. ద్రావిడ్‌ మూడు స్థానాలు దిగజారి 18వ ర్యాంక్‌, లక్ష్మణ్‌ 23, సెహ్వాగ్‌ 24వ ర్యాంక్‌లో నిలిచారు. ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ 34వ స్థానానికి పరిమితం అయ్యాడు. ఆసీస్‌ సిరీస్‌లో సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీ 17 ర్యాంక్‌లు ఎగబాకి 50వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. భారత సీనియర్‌ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ 10వ స్థానంలో .....