.

30, జనవరి 2012, సోమవారం

ఎస్సెమ్మెస్‌లకు కాలం చెల్లుతోందా ... ?

 ఎస్సెమ్మెస్‌... సమాచార వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన అధునాతన వారధి. సందర్భం ఏదైనా కావచ్చు. చివరకు క్లాసురూమ్‌లో వుండి కూడా మెసేజ్‌లు పంపుకోవడానికి అలవాటుపడిన నేటి తరం కొన్నాళ్లుగా వాటి జోరు తగ్గించేసిందట. మామూలు రోజుల సంగతి పక్కన పెడితే పండుగలు, వేడుకల సమయంలో వందల ఎస్సెమ్మెస్‌లు ఇచ్చిపుచ్చుకునేవారు. ఇవన్నీ నిన్నటి విషయాలు. ఇప్పుడు నెట్‌లో వచ్చిన కొన్ని ఉచిత సదుపాయాల వల్ల ఎస్సెమ్మెస్‌ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎక్కువగా గూగుల్‌ టాక్‌లు, యాహూ చాట్‌లపైనే ఆధారపడుతున్నారు. దీంతో పాటు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్లు కూడా ఎస్సెమ్మెస్‌ ప్రత్యామ్నాయమయ్యాయి. బ్లాక్‌బెర్రీ, ఐఫోన్ల వంటివి చేతిలో వుంటే... ఇక ఫోన్‌లోనే చాటింగ్‌లు చేసేసుకుంటున్నారు. దీంతో కొత్త టెక్నాలజీల వల్ల ఎస్సెమ్మెస్‌లకు కాలం చెల్లుతోందని పరిశీలకుల అభిప్రాయం.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి